జేడీకి విందు భోజనమా.. కాపులకు రిజర్వేషన్ కట్.!!

జనాల మీద మీడియా ప్రభావం ఎంత ఉందో తెలీదు కాని సోషల్ మీడియా ప్రభావం మాత్రం గట్టిగా ఉంది.. సామాన్యులు ఒకరిని తిట్టాలన్న, ఒకరిని పొగడాలన్నా సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు.. కాని కొందరి సామాన్యుల అత్యుత్సాహం కొందరు నాయకులకు తల నొప్పిగా మారుతుంది.. ప్రస్తుతం వైఎస్ జగన్ ది అలాంటి పరిస్థితే.. జగన్ అభిమానులు ఆయన్ని పొగుడుతూ ఎన్ని పోస్ట్ లు అయినా పెట్టొచ్చు.. దానివల్ల ఆయనికి మైలేజ్ వస్తుంది.. కానీ కొందరు వేరే వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.. దీనివల్ల జగన్ కి బోలెడంత మైనస్ అని తెలుసుకోలేకపోతున్నారు.

 

 

రీసెంట్ గా కాపు ఉద్యమనేత ముద్రగడను, జేడీ లక్ష్మీనారాయణ కలిసి విందు భోజనం చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. అయితే కొందరు జగన్ అభిమానులు మాత్రం ఈ ఫోటోలపై తెగ మండిపడుతున్నారు.. ఒకవైపు ఏమో అవినీతి ఆరోపణల కేసులో జగన్ ని విచారించిన వ్యక్తి, మరోవైపు కాపు రిజర్వేషన్స్ విషయంలో యూ టర్న్ తీసుకున్నాడంటూ జగన్ ని విమర్శించిన వ్యక్తి.. ఇలా ఇద్దరు ఒకే ఫొటోలో దర్శనమిచ్చేసరికి జగన్ అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకొని సోషల్ మీడియాలో పోస్టులుగా మారుతున్నాయి.. మరో వైపు ఈ ఫోటో గురించి పెడుతున్న కొన్ని పోస్ట్ లు మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి.. అలాంటి వాటిల్లో ఒకటే ఇది.. ముద్రగడ, జేడీకి భోజనం వడ్డిస్తున్న ఫోటో పెట్టి.. ' మా జగన్ అన్నకు పదహారు నెలలు చిప్పకూడు పెట్టించినోడికి విందు భోజనమా.. మీకూ, మీ జాతికి రిజర్వేషన్లు కట్' అని ఓ వ్యక్తి పోస్ట్ చేసాడు.. ఈ పోస్ట్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.