కేసిఆర్ కు మోత్కుపల్లి సవాల్

 

 

 

తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు సవాల్ విసిరారు. కేసిఆర్ మల్కాజ్ గిరి లోక్ సభకు పోటీ చేస్తే ఆయనపై పోటీ చేయడానికి సిద్దంగా వున్నానని తెలిపారు. మల్కాజిగిరి నుండి కెసిఆర్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అది నిజమా లేక లీకులా అన్నారు. ఆయన పోటీ చేసేది నిజమైతే.. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వం దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి తాజాగా మళ్లీ లైన్ లోకి వచ్చాడని చెప్పాలి. అయితే ఈ స్థానం నుండి టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.