TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్సీబీ వర్సెస్ ముంబై.. పరుగుల సునామీ కాదు.. అంతకు మించి

Published on: Mon Apr 13, 2026 8:48AM

ఐపీఎల్ 2026 సీజన్  పరుగుల పండుగగా మారింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముంబై ఇండియన్స్‌తో (ఎమ్ఐ) మధ్య జరిగిన మ్యాచ్ లో  రెండు జట్లూ కలిపి ఏకంగా  462 పరుగులు చేశాయి. 40 ఓవర్లలో ఈ స్థాయిలో పరుగులు వచ్చాయంటే.. బ్యాటర్ల విధ్వంసం ఏ రీతిలో ఉందో అర్ధమౌతుంది.

ఈ మ్యాచ్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి   240 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని   నిర్దేశించింది. ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫిల్ సాల్ట్ కేవలం 36 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 78 పరుగులు సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో    38 బంతుల్లో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు.

స్కిప్పర్ రజత్  కేవలం 20 బంతుల్లోనే  5 సిక్సర్లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశారు. ఆ తరువాత జితేశ్ శర్త విఫలమైనా,   టిమ్ డేవిడ్ 34 పరుగులతో రాణించడంతో.. ఆర్సీబీ భారీ స్కోరు సాఆధించింది.  ఇక ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టు తగ్గేదే లే అన్నట్లుగా ఆడింది. ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

అయితే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయి.. ఈ సిజన్ లో మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది.  ముంబై జట్టులో రూథర్‌ఫర్డ్ 31 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అంతకు ముందు ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోరు 19 వద్ద ఉండగా తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ కావడంతో ముంబై ఛేదనలో విఫలమైందని చెప్పవచ్చు.