రాజన్‌పై మళ్లీ స్వామి నిప్పులు..

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కోపం ఇంకా తగ్గినట్లులేదు. తాజాగా ఆయన మరోసారి రాజన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్‌కు కనీసం ఎకనామిక్స్‌లో డిగ్రీ కూడా లేదని ఆరోపించారు. ఇవాళ ప్రముఖ వార్తాసంస్థతో మాట్లాడిన స్వామి..ఆర్బీఐ గవర్నర్‌గా ఎంపికైన ఉర్జిత్ పటేల్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌‌డీ చేశారు. యాలే వర్శిటీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే రాజన్‌కు ఎకనామిక్స్‌లో కనీస డిగ్రీ కూడా లేదన్నారు. ఇంజనీరింగ్ తర్వాత నేరుగా మేనేజ్‌మెంట్ స్టడీస్ చేసిన రాజన్..ఎకనామిక్స్‌లో కనీస విద్యార్హత కూడా సాధించలేదని ఆరోపించారు.