రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా

 

Rayapati Sambasiva Rao, Telangana Rayapati

 

 

రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. విభజన వల్ల సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ఎట్టిపరిస్థితుల్లో విలీనం కాదని స్పష్టం చేశారు. పార్టీ కాదు...ప్రజల ఆకాంక్షే తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. రేపు హైదరాబాద్‌లో జరిగే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశానికి తాను హాజరుకావడం లేదని, ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని ఎంపీ రాయపాటి తెలిపారు.