శ్రీ రావురి భరద్వాజ గారు మృతి

 

 

తెలుగు సాహితీ జగత్తులో కేవలం స్వయంకృషితో, ప్రతిభా పాటవాలతో ఎదిగిన  గొప్ప రచయిత, జ్ఞానపీట్‌ అవార్డు గ్రహీత శ్రీ రావురి భరద్వాజ గారు ఈ రోజు(18.10.13) మృతి చెందారు. రావురి భరద్వాజ గారు జులై 5, 1925నాడు శ్రీమతి మల్లికాంబ, శ్రీ కోటయ్య దంపతులకు జన్మించారు. శ్రీ రావూరిగారు తాను అనుభవించిన కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను, అభిశంసలను, నిరాదరణలను, అనుభవాలను,  అనుభూతులను,కథా వస్తువులుగా మలుచుకున్నారు. జీవితమంతా, తెలుసుకుంటూ,తెలుసుకుంటూ ప్రయాణం సాగించాలి అనే భరద్వాజగారు అలానే ప్రయాణం సాగించారు. భరద్వాజగారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చెకురాలని కోరుకుంటోంది తెలుగువన్‌.కామ్‌.