TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రతన్ టాటాకి చంద్రబాబు నివాళులు!

Published on: Thu Oct 10, 2024 3:52PM

బుధవారం రాత్రి కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకి నివాళులు అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముంబైకి వెళ్ళిన విషయం తెలిసిందే. ముంబైలో రతన్ టాటా పార్థివ దేహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పూర్తి స్థాయిలో జరగాల్సి వుంది. అయితే రతన్ టాటా కన్నుమూసిన నేపథ్యంలో మంత్రిమండలి సమావేశాన్ని రతన టాటాకి నివాళులు అర్పించే కార్యక్రమంగా మార్చారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రివర్గ సహచరులు రతన్ టాటా చిత్ర  పటానికి నివాళులు అర్పించారు. మంత్రివర్గం సమావేశాన్ని అక్కడితో ముగించి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముంబైకి బయల్దేరారు.