పదవిలో కొద్దికాలంపాటే..
posted on Oct 25, 2016 4:10PM
టాటా గ్రూప్ ఛైర్మన్ గా సైరస్ మీస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రస్తుతానికి రతన్టాటానే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. టాటా గ్రూప్ ఛైర్మన్గా కొద్దికాలంపాటే తాను పదవిలో కొనసాగుతానని... ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు సంస్థ స్థిరత్వం, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాత్కాలిక ఛైర్మన్ పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త వ్యక్తి త్వరలోనే నాయకత్వ బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు. నాయకత్వం మారినా గ్రూప్ కంపెనీల సభ్యులు వ్యాపారంపై పూర్తి దృష్టి సారిస్తారని అభిప్రాయపడ్డారు. టాటా సన్స్ ప్రకటించిన ఎంపిక కమిటీ నూతన ఛైర్మన్ను ఎంపిక చేస్తుందని, ఈ ప్రక్రియ సుమారు 4నెలలు పట్టే అవకాశం ఉందని రతన్ టాటా పేర్కొన్నారు.