దిశకు న్యాయం చేసారు సరే... మరి మా బిడ్డలకు న్యాయం చేయరా..

 


దిశా కేసు నిందితులను నిన్న పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దింతో దిశకు న్యాయం జరిగిందని దేశం మొత్తం పోలీసులను ప్రశంసిస్తున్నారు. ఐతే అదే సమయంలో గత కొంత కాలంగా హత్యాచారాలకు గురైన బాధితులు వారి కుటుంబాలు దీని పై హర్షం వ్యక్తం చేస్తూ మరి మా బిడ్డలకు న్యాయం ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి జిల్లా హజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివా్‌సరెడ్డి కొంత మంది  చిన్నారులపై అత్యాచారం జరిపి, హత్య చేసి, బావిలో పడేసిన విషయం తెలిసిందే. ఇపుడు దిశ నిందితుల్లాగా శ్రీనివాసరెడ్డినీ ఎన్ కౌంటర్ చేయాలని బాధిత కుటుంబాలు , గ్రామస్థులతో కలిసి శుక్రవారం ధర్నా చేశారు. అలాగే దిశ హత్యకు ఒకరోజు ముందు హన్మకొండలో ఓ యువతిపై ఆమె పుట్టినరోజు నాడే అత్యాచారం జరిపి హత్య చేసిన నిందితుడిని కూడా వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధిత యువతి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే 2018 లో ధర్మసాగర్‌ మండలం బంజరుపల్లిలో 62ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిపి క్రూరంగా హత్య చేసిన ముగ్గుఋ నిందితులను కూడా  వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని గ్రామస్థులు, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. హన్మకొండలో ఆర్ నెలల క్రితం 9 నెలల పసిపాపను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి హత్యచేసిన నిందితుడు ప్రవీణ్‌ను కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని ఆ చిన్నారి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇటువంటి హత్యాచార ఘటనలలో దిశ కేసు మాదిరిగానే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్ లు వెల్లువెత్తుతున్న నేపధ్యం  లో పోలీసులు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.