యు.పి.లో కదిలే కారులో అత్యాచారం..

 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రేప్‌లు ఆగడం లేదు. తాజాగా నలుగురు దుండగులు కదిలేకారులో ఓ 18 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. బాధితురాలిని అలహాబాద్కు చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలు రాణిగంజ్కు వెళ్లేందుకు నిందితుల్లో ఒకరిని సాయం కోరగా, అతను మరో ముగ్గురిని వెంటతీసుకెళ్లాడు. దారి మధ్యలో నలుగురూ ఆమెపై దారుణానికి పాల్పడి రోడ్డుపైకి తోసేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నలుగుర్ని అరెస్ట్ చేశారు.