TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ అనుకూల సీఐపై అత్యాచారం కేసు!

Published on: Thu Apr 30, 2026 4:32PM

 

వైసీపీ అనుకూలుడిగా పలు అక్రమాలకు పాల్పడి .. పనిష్మెంట్‌లో ఉన్న సీఐ తన అరాచక బుద్ది మాత్రం మార్చుకోలేదు. ఇంత కాలం సీఐడీలో పనిచేసి, ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం కేసులో ఇరుక్కోవడం కలకలం  రేపుతోంది. మల్లయ్య తన ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి, తనపై అత్యాచారం చేశాడని భాధితురాలు వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన ఒక కుటుంబం కొంతకాలంలో మండలంలోని వేరే గ్రామంలో అద్దెకు ఉంటోంది. 

అదే గ్రామ వాసి అయిన  సీఐ చిన్నమల్లయ్య బుధవారం (29-4-26న) గ్రామానికి వచ్చాడు. పక్కింట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు చేసిన బాధితురాలికి ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి, సీఐ అకృత్యాన్ని నిర్ధారించారు. వైసీపీ హయాంలో సీఐడీ సీఐగా ఉన్న మల్లయ్య తెలుగుదేశం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. 2024లో కారంపూడిలో ఒక టీడీపీ నాయకుడిని గన్‌తో బెదిరించాడు. ఇటీవలే కారంపూడికి చెందిన టీడీపీ నేతలను వాట్సప్‌లో బెదిరించాడు. తాజాగా అత్యాచారం కేసులో చిన్నమల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వినుకొండ పోలీసులు తెలిపారు.