TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాకి ఇటలీలో పెళ్ళి

Published on: Tue Apr 22, 2014 2:12PM

 

ప్రముఖ బాలీవుడ్ కథానాయిక రాణిముఖర్జీ పెళ్ళి చేసుకుంది. రాణీ పెళ్ళాడింది ఎవర్నో కాదు.. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘మొహబ్బతే’, ‘రబ్ నే బనాదీ జోడీ’ తదితర చిత్రాల దర్శకుడు, యష్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రాతో. ఈమధ్యకాలంలో వీరిద్దరి ‘అనుబంధం’పై బాలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లను నిజం చేస్తూ వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. సోమవారం రాత్రి ఇటలీలో సమీప బంధువుల సమక్షంలో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఈ విషయాన్ని యష్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ హీరోయిన్లందరూ రెండో పెళ్ళివాడిని చేసుకోవడం అనే సంప్రదాయం అనేకమంది హీరోయిన్ల విషయంలో జరిగింది. ఆదిత్య చోప్రాకి గతంలో పాయల్ ఖన్నాతో పెళ్ళయింది. విభేదాల కారణంగా వీరిద్దరూ 2009లో విడిపోయారు.