న్యాయవాదిని సజీవ దహనం చేసిన దుండగులు

రంగారెడ్డి జిల్లా కీసరలో దారుణం జరిగింది. నిన్న అర్థరాత్రి ఓ న్యాయవాదిని దుండగులు కారులో సజీవదహనం చేశారు. కుషాయిగూడకు చెందిన న్యాయవాది ఉదయ్‌కుమార్‌ను దాయారు కీసర వద్ద నిర్మానుష్య ప్రాంతంలో కారుతో పాటు దహనం చేశారు. ఉదయం దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోపల పూర్తిగా కాలిపోయిన మృతదేహన్ని కనుగొన్నారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, ఇతర ఆధారాలతో హత్యకు గురైన వ్యక్తి న్యాయవాది ఉదయ్‌కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాతకక్షలే హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.