తప్పుడు ప్రచారాలు చేయోద్దు.. రాం దేవ్ బాబాకు ఝలక్..


ప్రముఖ యోగా గురువు రాం దేవ్ బాబాకు ఓ ఝలక్ తగలింది. ఆ ఝలక్ ఇచ్చింది ఎవరో కాదు ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ). గతంలో పతంజలి ఆయుర్వేద సంస్థ కోల్డ్‌ ప్రాసెస్డ్  టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని ప్రచారం చేసిన నేపథ్యంలో వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్‌ఈ), ఆహార భద్రతా ప్రమాణాల భారతీయ సంస్థ  (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రకటనల ప్రమాణాల మండలి ఫిర్యాదు చేసింది. తప్పుడు ప్రచారం ద్వారా పతంజలి ఆయుర్వేద వినియోగదారుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. పతంజలి సంస్థ మాత్రం తాము ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయలేదని అంటుంది. దీంతో దీనిపై విచారించిన ప్రమాణాల భారతీయ మండలి పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసింది.  తనకు అందిన సుమారు 156  ఫిర్యాదులపై విచారించి ఈ ప్రకటన విడుదల చేసింది. మరి దీనిపై ఇప్పుడు పతంజలి సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.