కేరళ సీఎం పన్నీర్ సెల్వమా..? ఎప్పుడయ్యాడు..?
posted on Jan 24, 2017 11:52AM
రాజకీయ నాయకులు అప్పుడప్పుడు పొరపాటు పడటం.. ట్వీట్స్ చేయడం కామన్. ఇప్పుడు అలాంటి పొరపాటే చేసి బుక్కయ్యారు మంత్రి రాంవిలాస్ పాశ్వాన్. అసలు సంగతేంటంటే.. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారు వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్.. 'కేరళ ముఖ్యమంత్రి శ్రీ పన్నీర్ సెల్వం, ఆయన అధికార బృందంతో భేటీ అయ్యాను' అంటూ ట్వీట్ చేశాడు. ఇంకేముంది నెటిజన్లకు మంచి వార్త కనపడింది. దీంతో మంత్రిగారు ఒకటే కామెంట్లు మొదలయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత వీరవిధేయుడైన పన్నీర్ సెల్వం కేరళకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటూ కొంతమంది అంటే.. పాశ్వాన్ రాహుల్ గాంధీతో పోటీపడుతున్నారా? మరి కొంతమంది సెటైర్లు వేశారు. తాను స్వయంగా ఎవర్ని కలిసింది కూడా ఆయనకు తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక అంతా అయిపోయిన తరువాత పొరపాటును గుర్తించిన పాశ్వాన్ పాత ట్వీట్ను డిలీట్ చేసి.. కేరళ సీఎం పినరయి విజయన్ అంటూ తప్పును సరిదిద్దుకున్నారు.