వర్మ మొబైల్, ల్యాప్‌టాప్ సీజ్

జీఎస్టీ సినిమాను మహిళల మనోభావాలను దెబ్బతీసేలా తెరకెక్కించారని.. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ‌పై మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆయన్ను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా నోటీసులు పంపారు. దీనిలో భాగంగా సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు వర్మ. దాదాపు మూడున్నర గంటలపాటు ఆయన్ను విచారించిన పోలీసులు.. వర్మపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్జీవీ మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్ సీజ్ చేసిన పోలీసులు సోమవారం మరోసారి హాజరు కావాల్సిందిగా నోటీసు జారీ చేశారు. జీఎస్టీకి సంబంధించిన వివరాల కోసమో పోలీసులు వాటిని సీజ్ చేసినట్లు సమాచారం.