మార్చి 10న రజనీ పాటలు
Published on: Tue Feb 18, 2014 9:16AM

రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం "విక్రమసింహ". సౌందర్య దర్శకత్వం వహిస్తుంది. ఈ చిత్రం పాటలను వచ్చే నెల 10న హైదరాబాదులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ వర్షన్ పాటల వేడుక చెన్నైలో ఒకరోజు ముందుగానే అంటే వచ్చే నెల 9నే జరగనుందని కోలీవుడ్ సమాచారం. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ లుల్లా నిర్మాత.


