కలైంగర్ మృతిపై తలైవా ఏమన్నారంటే…


కరుణానిధి మృతి చెందిన ఈరోజును ‘బ్లాక్ డే’! ఈ  బ్లాక్ డేను నేను ఎప్పుడూ మర్చిపోలేను! కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను! ఇదీ తలైవర్ రజినీకాంత్ ట్వీట్….

 

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై సూపర్ స్టార్ రజనీకాంతే కాదు చాలా మంది తమిళ ప్రముఖులు మీడియాలో, సోషల్ మీడియాలో స్పందింస్తున్నారు. కలైంగర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు నటులు గుర్తు చేసుకుంటున్నారు. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని, ఆయన్ని మిస్సయ్యాం కానీ, ఆయన సంక్పలం మాత్రం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని తెలుగు వారికి కూడా సుపరిచితురాలైన రాధిక అన్నారు. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారని, ఆయనకు కన్నీటి వీడ్కోలు చెబుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈతరం కోలీవుడ్ హీరోయిన్ హన్సిక కూడా మహానేత మృతిపై స్పందించింది. కరుణానిధి మరణ వార్తను జీర్ణించుకునే ధైర్యం ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, యావత్తు తమిళ ప్రజలకు ఆ దేవుడు ప్రసాదించాలని ప్రార్థించింది. కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నటి ఖుష్భూ సైతం తన బాధని వెలిబుచ్చారు. నెల క్రితమే కరుణానిధితో కలిసి ఓ ఫొటో దిగానని, గొప్ప నాయకుడైన ఆయన్ని కలవడం అదే చివరిసారి అవుతుందని అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ‘అప్పా, మేమ మిమ్మల్ని మిస్సవుతున్నాం’ అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు!