మంత్రిని స్కూటరిస్ట్ ఢీ.. కాలికి ఫ్రాక్చర్

 

రాజస్థాన్ మంత్రిని స్కూటరిస్ట్ ఢీ కొన్న ఘటన అజ్మీర్ లో చోటుచేసుకుంది. సెక్యూరిటీ అంతా ఉండగానే రోడ్డు దాటుతున్న మంత్రిగారికి ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి వాసుదేవ్ దేవ్ నాని అజ్మీర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లారు. అయితే అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు అయన తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ స్కూటరిస్టు మంత్రిని ఢీ కొట్టడంతో ఆయన గాయపడ్డారు. వెంటనే ఆయనను అజ్మీర్ లోని జేఎల్ఎన్ ఆసుపత్రికి తరలించగా, ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు.