కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

 

కేరళలో వరదల పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ.. కేరళకు తక్షణ సాయం కింద 500కోట్లు రూపాయిలు ప్రకటించారు.. అదే విధంగా వరద బాధితులకు నష్టపరిహారం కూడా ప్రకటించారు.. అయితే మోదీ, కేరళకు సాయం ప్రకటించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.. 'డియర్‌ పీఎం.. కేరళ వరదలను తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి.. కేరళలో ప్రజల పరిస్థితి, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.. మరోవైపు కేరళ ప్రజలకు ఆర్థికసాయం అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకొచ్చింది.. ఈ విషయమై నేడు ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు సమావేశమై విరాళాలపై నిర్ణయం తీసుకున్నారు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల నెల వేతనాన్ని కేరళకు విరాళంగా ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది.. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు.