రాహుల్ హగ్.. మోడీ షాక్.!!
posted on Jul 20, 2018 2:53PM
పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అవిశ్వాసంపై చర్చలో భాగంగా అప్పటివరకూ మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ప్రసంగం ముగించే ముందు మోడీ వద్దకు వెళ్లారు.
‘నా మీద మీలో కోపం, ద్వేషం ఉన్నాయి. నేను వాటిని తొలగిస్తా’ అంటూ ప్రధాని మోదీకి షేక్హ్యాండ్ ఇచ్చి అలింగనం చేసుకున్నారు. ఊహించని రాహుల్ చర్యతో ప్రధాని మోదీ ఆశ్చర్యానికి గురయ్యారు.మోదీని ఆలింగనం చేసుకుని తిరిగి వెళ్లిపోతున్న అనంతరం రాహుల్ను వెనక్కి పిలిచిన మోదీ,కరచాలనం చేసి ఆయన భుజంపై తట్టారు. తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చొన్న రాహుల్ తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను కొడుతూ కనిపించారు. ప్రధాని నరేంద్రమోదీని, రాహుల్ ఆలింగనం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా హల్చల్ చేస్తున్నాయి.