రాహుల్ గాంధీకి నో ఎంట్రీ...


ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ జిల్లాలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దళితులు, ఠాకూర్ వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉద్రిక్తతలను తగ్గించేందుకు మొబైల్ ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను నిలిపివేశారు. అయితే ఇప్పుడు అక్కడికి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించారు పోలీసులు. రేపు అక్కడకు వెళ్లడానికి రాహుల్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నార. అయితే ఈరోజే ఆయన అక్కడికి వెళ్లారు. దీంతో ఆయనకు అనుమతిని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.