రాహుల్‌గాంధీ కనిపించడం లేదు.. ఆప్ మంత్రి

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసులు విద్యుత్ కోత‌లు, తాగునీటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారని.. ఆ సమస్యలను ప‌రిష్కారం చేయాలంటూ కాగ‌డాల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌నున్నారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన‌నున్నారు. అయితే ఈ ర్యాలీ సందర్భంగా ఆప్ మంత్రి కపిల్ మిశ్రా రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా ట్విట్టర్ లో రీ ట్వీట్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ ఎన్నో రోజుల నుంచి కనిపించడం లేడని, ఈ ర్యాలీ తోనైనా వారు రాహుల్ గాంధీని క‌లుస్తార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.