TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రత్యేక హోదా ఇస్తే నీకేంటి నష్టం... రఘువీరారెడ్డి

Published on: Wed May 20, 2015 12:38PM

 

కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేదర్ రెడ్డి పై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కాంగ్రెస్ తోపాటు పార్టీ అధిష్టానం కోరుతుండగా.. గుత్తా సుఖేందర్ రెడ్డి ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రఘువీరా రెడ్డి స్పందించి ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తే ఆయకేం నష్టంమని ప్రశ్నించారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమని, ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఏపీకీ తరలిపోతాయంటూ గుత్తా ఆరోపించారు. అసలు రేవులు, పరిశ్రమలు, ఆర్ధికంగా వెనుకబడిన హిమాలయ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తారని ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం తగదని లేఖలో పేర్కొన్నారు. దీంతో రఘువీరారెడ్డి ఈ విషయంపై సోనియా గాంధీకి గుత్తా సుఖేందర్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీకీ ప్రత్యేహోదా ఇస్తామని హామీ చేశారని, ఈ విషయం పై లోక్ సభలో కూడా ఏపీ ప్రత్యేక హోదా గురించి ఏం చేశారని మీరు నిలదీశారని గుర్తుచేశారు. ఇటు రాష్ట్రంలోనూ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నాయని, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ ప్రజలు మన ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారని ఇలాంటి సమయంలో గుత్తా లేఖ రాయడం సరికాదని అన్నారు.