కేంద్రమంత్రి రఘునాథ్ ఝా మృతి...

 

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి రఘునాథ్ ఝా మృతి చెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. రఘునాథ్ ఝా భార్య దీవ్ కర్నా దేవి, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన్ను కుటుంబీకులు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తుండగా, పరిస్థితి విషమించి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బీహార్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సన్నిహితుడిగా ఉంటూ, బెతయ్యా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన, 2004లో ఏర్పడిన మన్మోహన్ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు.