రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని విషయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఉన్నదే చెప్పిందని వ్యాఖ్యానించారు. రాజధానిపై రాష్ట్రాలదే నిర్ణయమని, రాష్ట్రం ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకుందని అన్నారు. రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మార్చడం కుదరదని అన్నారు. దీనిపై రాజధాని రైతులు, మహిళలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులో విశాఖ పేరులేదని గుర్తుచేసారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని పేర్కొన్నారు. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, రాయలసీమకు తరలిపోదని రఘురామ కృష్ణరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.