రక్తసిక్తమైన పాకిస్థాన్... పోలీస్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాడి

 

పాకిస్థాన్ లో ఈ మధ్య తరచూ ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోమారు ఉగ్రదాడులతో పాకిస్థాన్ రక్తసిక్తమైంది. క్వెట్టాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీస్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ శిక్షణా కేంద్రంలో మొత్తం 700 మంది ఉండగా.. ఈ ఘటనలో 59 మంది మృతి చెందగా  118 మంది గాయపడ్డారు. జరిగిన ఘటనపై స్పందించిన బలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడుల్లో ఇది మూడోదని.. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని.. మిగిలిన ఉగ్రవాదులు కాలేజీ వసతి గృహంలో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ దాడికి పాల్పడింది.. పాకిస్థాన్ తాలిబన్‌కు అనుబంధమైన లష్కరే ఝంగ్వి ఉగ్రవాద సంస్థకు చెందిన అల్-అలిమి ఫ్యాక్షనే అని తమ వద్ద సమాచారం ఉందని మంత్రి తెలిపారు.