తిరుమల నడకదారిలో కొండచిలువ.. భయంతో బెంబేలెత్తిన భక్తులు
Published on: Wed Sep 17, 2025 12:05PM

తిరుమల నడక దారిలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. పది అడుగుల పొడవు ఉన్న కొండచిలువను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. జనం అలికిడి, హడావుడితో ఆ కొండచిలువ నడకదారిలోని ఓ దుకాణంలోకి దూరింది.
దుకాణదారుడు, భక్తులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన స్నేక్యాచర్ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో నడకదారిలో ఉన్న దుకాణాల యజమానులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.


