ప్రియమైన టీవీ యాంకర్లకు...సొల్లు కబుర్లు వద్దప్పా...పీవీపీ సంచలనం !


విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ లో పీవీపీ ఎంటర్ అయ్యారు. కేశినేని నానీకి, బుద్దా వెంకన్నకు చురకలు అంటించారు. ఏకంగా కేశినేని నానీపై పరువు నష్టం దావా వేసి నోటీసులు పంపించారు. అంతే కాదు మరో రెండు టీవీ చానల్స్ కు కూడా ఆయన లీగల్ నోటీసులు పంపించారు. గత ఎన్నికల సమయంలో తనపై కేశినేని నానీ దుష్ప్రచారం చేశారని పరువు నష్టం దావా వేశారు. 

వంద కోట్ల పరువు నష్టం దావా వేసిన ఆయన ఇందుకు సంబంధించి ఎంపీ కేశినేని నానికి లీగల్ నోటీసులు పంపించారు. ఎన్నికల సందర్భంగా కేశినేని నాని నోటికి వచ్చిన విధంగా ప్రచారం చేశారని, తనను నేరస్తుడని ఆరోపించారంటూ పొట్లూరి మండిపడ్డారు. అందుకే తాను ఎంపీకి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు పొట్లూరి తెలిపారు. పనామా పేపర్లలో తన పేరుందని కేశినేని నానీ చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తాను లీగల్ నోటీసును ఉపసంహరించుకునేది లేదని క్లారిటీ ఇచ్చారు. 

ఇక ఈ నోటీసులపై కూడా కేశినేని నానీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఉడత ఊపుళ్లు నేను చిన్నప్పుడే చూశానంటూ లీగల్ నోటీసులను చాలా లైట్ గా తీసుకున్నారు. మరేం అనుకున్నారో ఏమో కానీ తాజాగా, ఈ ఉదయం పీవీపీ మరో సంచలన ట్వీట్ పెట్టారు. మీడియా మిత్రులకు తన లా పవర్ చూపుతున్నానని అన్నారు.  

"నా ప్రియమైన టీవీ5 యాజమాన్యం, సంపాదకులు, యాంకర్లకు... లా బ్రేక్ చేసే మీలాంటి మీడియా మిత్రులకు ఆ లా యొక్క పవర్ చూపించడానికి మరో చిరు టీజర్ నా తరఫున. మీ హక్కులు ఎక్కడ ముగుస్తాయో... నా చికిత్స అక్కడ ప్రారంభమవుతుంది. ఈ షో రేపు కూడా కొనసాగుతుంది..." అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. 

అలాగే కొద్ది సేపటి క్రితం  ఆ రోజుల్లో ఆస్తులు అమ్మి స్వాతంత్ర సమరయోధులు పోరాటాలు చేసి ప్రజాసేవ చేసారు. ఆస్తులు అమ్మాను అని సొల్లు కబుర్లు వద్దప్ప !! ఊరంతా కోడై కూస్తుంది, మీ ప్ర"బుద్ధుడి"తో సహా !! కాస్త కూడు లేని కార్మికులకు వాళ్లకు కట్టవలసిన జీతాలు కట్టవయ్యా మగడా!! అంటూ కేశినేని ట్రావెల్స్ లో ఉద్యోగస్తులను ఉద్దేశించి పేర్కొన్నారు. మరి దీని మీద కేశినేని ఎలా స్పందిస్తారో చూడాలి.