చైర్‌పర్సన్‌ గా పురందేశ్వరి

 

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై కసరత్తు ప్రారంభించింది. పార్టీ కమిటీల నియామకాన్ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీని అధిష్టానం నియమించింది. ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా పురంధేశ్వరిని ఎంపిక చేశారు. కన్వీనర్‌గా ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావును నియమించారు. వీరిద్దరితోపాటు మరో 9 మందిని సభ్యులుగా నియమించారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి చేపట్టనున్న బస్సు యాత్రకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మేనిఫెస్టోను కూడా ప్రజలకు చేరువయ్యేలా రూపొందించడానికి ఈ కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది.

బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీ:

1. డి. పురందేశ్వరి(చైర్‌పర్సన్‌)
2. ఐవైఆర్‌ కృష్ణారావు(కన్వీనర్‌)
3. పి. విజయ బాబు
4. పీవీఎన్‌ మాధవ్‌
5. దాసరి శ్రీనివాసులు
6. షేక్‌ మస్తాన్‌
7. పాక సత్యనారాయణ
8. కె. కపిలేశ్వరయ్య
9. పి సన్యాసి రాజు
10. సుదీష్ రాంబోట్ల
11. డీఏఆర్‌ సుబ్రహ్మణ్యం.