ఇంగ్లాండ్ పై పుజారా దూకుడు
posted on Nov 23, 2012 4:16PM
ముంబైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒకవైపు వికెట్లు పడుతున్న పుజారా మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు. మొదటి టెస్టులో డబుల్ సెంచరి చేసిన పుజారా, రెండో టెస్టులో కూడా సెంచరీతో ఇండియాకి అండగా నిలిచాడు. అశ్విన్ కూడా హాఫ్ సెంచరీతో పుజారాకి మంచి సహకారం అందిస్తున్నాడు. తన వందో టెస్టు మ్యాచులో శతకం చేస్తాడని ఆశించిన వీరేంద్ర సెహ్వాగ్ అబిమానులను నిరాశపరిచాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పనేసర్ నాలుగు వికెట్లు, అండర్సన్ ఒకటి, స్వాన్ ఒక వికెట్ తీశారు. 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల వద్ద ఆట ముగిసింది.
ఇండియా స్కోర్ వివరాలు : గౌతమ్ గంభీర్ : 4, సెహ్వాగ్ : 30, పుజారా (నాటౌట్) : 114, సచిన్ : 8, కోహ్లీ : 19, యువరాజ్ సింగ్: 0, కెప్టెన్ ధోనీ : 29, అశ్వీన్ (నాటౌట్) : 60, ఎక్స్ట్రా : 2.