వారణాసి నుంచి ప్రియాంక గాంధీ.. క్లారిటీ వచ్చేసింది

 

ప్రియాంక గాంధీ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి లోక్‌సభ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగింది. ప్రియాంక కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే.. తాను పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో వారణాసి నుంచి ప్రియాంక బరిలోకి దిగడం ఖాయమని భావించారంతా. అయితే, తాజాగా కాంగ్రెస్ వారణాసి స్థానానికి అజయ్ రాయ్‌ పేరుని ప్రకటించింది. దీంతో వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం లేదనే క్లారిటీ వచ్చేసింది.