మరోసారి నెటిజన్ల నోట్లో ప్రియాంక...

 

ఈ మధ్య ప్రియాంక చోప్రా ఏం చేసినా అది వివాదస్పదంగానే మారుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఏ ఫొటో పోస్ట్ చేసినా అది కూడా వివాదాస్పదంగానే మారుతుంది. నెటిజన్ల ఆగ్రహానికి గురవతుంది. ఇప్పుడు మరోసారి ప్రియాంక నెటిజన్ల నోట్లో నానింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు సోషల్‌మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. జీన్స్, టీషర్ట్  ధరించిన ప్రియాంక.. జాతీయ జెండా రంగులతో ఉన్న ఒక దుప్పట్టాన్ని మెడపై వేసుకొని దానిని చేతితో పట్టుకొని ఫొటో దిగింది. దానిని ఇన్ స్ట్రాగ్రామ్ లో మై హార్ట్ బిలాంగ్స్ టూ ఇండియా హ్యష్ ట్యాగ్ తో పోస్టు చేసింది. అంతే ఇక ప్రియాంక చోప్రాపై నెటిజన్లు మండిపడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా, చీర, సల్వార్‌ కమీజ్‌ వేసుకోకుండా ఇలాంటి డ్రస్‌లు ఏంటని కామెంట్‌ చేశారు. తనను తిరిగి ఇండియాలోకి రావద్దంటూ మండిపడ్డారు. జాతీయ జెండాను అవమానించే విధంగా దుపట్టాలా కప్పుకుంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనికి ప్రియాంక ఎలా రియాక్షన్ ఇస్తుందో.. గతంలో మోడీని కలిసినప్పుడు ప్రియాంక డ్రస్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లకు.. వేరే ఫొటో పెట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.