TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రూ.10, రూ. 20 ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

Published on: Tue Jul 28, 2026 4:56PM

 

దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 20 రూపాయల విలువల పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను తొలుత ప్రయోగాత్మకంగా (ఫీల్డ్ ట్రయల్స్) విడుదల చేసి, అనంతరం సాధారణ చలామణిలోకి తీసుకురా వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, ఈ కొత్త ప్లాస్టిక్ నోట్లు ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్ల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయవని, అవి కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా చలామణిలో కొనసాగుతాయని ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా జూలై 17న భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ కు చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) పాలిమర్ నోట్ల తయారీకి అవసర మైన ప్రత్యేక పాలిమర్ సబ్‌స్ట్రేట్ తయారీ, సరఫరా కోసం అంతర్జా తీయ స్థాయిలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) ఆహ్వానించింది. 

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన సంస్థల ద్వారా నోట్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సమకూర్చ నున్నారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ పాలిమర్ నోట్ల వినియోగం, వాటి మన్నిక, ప్రజల స్పందన, డిజిటల్ చెల్లింపులపై పడే ప్రభావం వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే,రూ 10, రూ.20 విలువలలో ఒక్కో డినామినేషన్‌కు సుమారు 100 కోట్ల (ఒక బిలియన్) నోట్లను ముద్రించే ప్రణాళిక ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు నీరు, తేమ, దుమ్ము, మురికి వంటి వాటికి సులభంగా దెబ్బతినవు. 

చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం వంటి సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో నోట్ల ముద్రణ వ్యయం దీర్ఘకాలంలో తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదనంగా, పాలిమర్ నోట్లలో పారదర్శక విండోలు, ప్రత్యేక హోలోగ్రామ్‌లు, అధునాతన భద్రతా గుర్తులు వంటి సాంకేతిక భద్రతా ఫీచర్లను అమర్చ డం సులభం. దీంతో నకిలీ కరెన్సీ తయారీని గణనీయంగా అరికట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయప డుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, రొమేనియా సహా అనేక దేశాలు పాలి మర్ కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి. 

ఈ దేశాల్లో పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు నిర్వహణ వ్యయాన్ని కూడా తగ్గించాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సాంకేతిక ప్రమాణాలు, భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ కూడా పాలిమర్ కరెన్సీ దిశగా తొలి అడుగు వేస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉందని, ఫీల్డ్ ట్రయల్స్ ఫలితాలు, సాంకేతిక అధ్యయనాలు, ప్రజల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి అమలుపై తుది నిర్ణయం తీసుకుం టామని ప్రభుత్వం వెల్లడించింది.

printing of plastic notes, RBI, BRBNMPL, Central Goverment, Polymer notes, Australia, Canada, UK, New Zealand, Lok Sabha