ప్రభుత్వం చెప్పుచేతల్లోకి ప్రసారమాధ్యమాలు
Published on: Wed Aug 29, 2012 9:32AM
అసోం అల్లర్లలో విద్యేషాల్ని రెచ్చగొట్టడానికి ఫేస్ బుక్ ని కొందరు అడ్డంగా వాడుకున్నారన్న విషయం బైటపడిపోయింది. ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చిత్రాల్ని ఈ మాధ్యమం ద్వారా చాలామందికి సర్క్యులేట్ చేసి నష్టాన్ని భారీగా పెంచారన్న విషయం ప్రాథమిక విచారణలో తేలింది. దీన్ని సాకుగా చూపిస్తూ మొత్తం ప్రసారమాధ్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రతిపాదనకు ప్రభుత్వం పదునుపెడుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు చెప్పుకుంటున్న స్వీయనియంత్రణ ఒట్టిమాటేనని చెబుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలతోపాటు ఇంటర్ నెట్ మాధ్యమాల్నికూడా చెప్పుచేతల్లో పెట్టుకునే ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించింది. 1978 ప్రెస్ కౌన్సిల్ చట్టానికి సవరణలు చేసి వెంటనే మీడియాపై అదుపును సాధించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సూచించింది.
.jpg)


