TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిఐడి కార్యాలయానికి చేరుకున్న పోసాని 

Published on: Thu Apr 3, 2025 2:39PM

నటుడు  పోసాని కృష్ణ మురళి షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పోసానికి బెయిల్ ఇచ్చేముందు కోర్టు ప్రతీ  సోమవారం,  గురువారం  మంగళగిరి సిఐడి కార్యాలయానికి రావాలి. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని   బెయిల్ పై విడుదలైన తర్వాత మంగళగిరి  సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నప్పుడు రోజుకో కోర్టు , రోజుకో జైలు అన్నట్టు ఉండేది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై  ఆంధ్ర ప్రదేశ్ లోని 18 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఒక్కో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం అరెస్ట్ కావడం చకచకా జరిగిపోయాయి.  ఈ కేసుల్లోనే ఒక వేళ కోర్టు  పోసానికి బెయిల్ ఇచ్చినప్పటికీ పీటీ వారెంట్ పై పోసాని అరెస్ట్ అయ్యేవారు. మంగళగిరి సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిన నేపథ్యంలోనే పోసానికి బెయిల్ వచ్చింది. వైకాపా హాయంలో సకల శాఖా మంత్రి సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోసాని తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. చలన చిత్ర రంగంలో ఉన్నప్పుడు పోసాని స్వయంగా స్క్రిప్ట్ లు రాసేవారు. ప్రస్తుతం వేరే వాళ్లు రాసిచ్చే స్క్రిప్ట్ ప్రకారం రాజకీయాల్లో నటుడిగా మిగిలిపోయి కేసులు ఎదుర్కొంటున్నారు.  కోర్టు ఆదేశం ప్రకారం ఆయన గురువారం సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు.