గ్రేటర్ ఎన్నికల కోసం పొన్నాల ప్రయత్నాలు..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యనేతల మధ్య ఉన్న అనైక్యత పార్టీ ఓటమికి ప్రధాన కారణమైందని నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రధానంగా టీ-పీసీసీ చీఫ్ దృష్టి పెట్టారు. గ్రేటర్ లో కాంగ్రెస్ నేతలందరిని ఓకే మార్గంలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలను మొదలు పెట్టారు. కాంగ్రెస్ లో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామన్న విషయాన్ని గ్రహించిన ఆయన పార్టీ కోసం పని చేసిన నేతలకు
గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ ను సిద్దం చేసేందుకు ఆయన రంగాన్ని సిద్దం చేస్తున్నారు. మరి గ్రేటర్ ఎన్నికల కోసం పొన్నాల చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి!