మూడు గంటలకు 59 శాతం ఓట్లు పోలింగ్

 

తెలంగాణలో భారీ పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం సాయంత్రం మూడు గంటల సమయానికి 59 శాతం ఓట్లు పోలయ్యాయి. జిల్లాల వారీగా పోలింగ్ శాతాల వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ – 51 శాతం, రంగారెడ్డి – 54 శాతం, ఆదిలాబాద్ – 62 శాతం, నిజామాబాద్ – 61 శాతం, మెదక్ – 65 శాతం, కరీంనగర్ – 58శాతం, వరంగల్- 62 శాతం, మహబూబ్ నగర్ - 61 శాతం, నల్గొండ – 58 శాతం, ఖమ్మం – 58 శాతం.