బీజేపీకి వ్యతిరేకంగా బీహార్‌లో మహాకూటమి!!

 

భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా బీహార్‌లో ‘మహాకూటమి’ ఏర్పడింది. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. మొన్నటి వరకూ ఒకరినొకరు తిట్టుకున్న ఈ మూడు పార్టీలు ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకన్నాయి. ఆగస్టు 21న ఈ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగనుంది. ఎన్నికల పొత్తులో భాగంగా జేడీయూ, ఆర్జేడీ నాలుగేసి స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. జేడీయూ, ఆర్జేడీ మాజీ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, లాలూప్రసాద్‌యాదవ్‌లు కలిసికట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ఎంత చేసినా ఎన్నికల పూర్తయిన తర్వాత ఈ మూడు పార్టీల నాయకులు ఒకరినొకరు నోరారా తిట్టుకుంటారు!