హీరోయిన్ రేప్ కేసు: మంత్రి కొడుకు పరార్...

 

కన్నడ హీరోయిన్ మైత్రేయ రేప్ కేసులో కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ పరారీలో వున్నాడు. బెంగుళూరు పోలీసులు కార్తీక్ గౌడ మీద రేప్ కేసు నమోదు చేశారు. అయితే కార్తీక్ గౌడ పరారీలో వుండటంతో ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కార్గీక్ గౌడ వెంటనే లొంగిపోవాలని సోమవారం అల్టిమేటం జారీ చేశారు. ఈ బుధవారం లోగా లొంగిపోకపోతే వెతికి మరీ అరెస్ట్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. తనను ప్రేమ పేరుతో వంచించి మానభంగం చేశాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ ఈమధ్య బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా వుండగా కోర్టు నుంచి బెయిల్ లభించిన తర్వాతే పోలీసులకు లొంగిపోవాలన్న ఉద్దేశంలో కార్తీక గౌడ వున్నట్టు సమాచారం. మొత్తమ్మీద ఈ వ్యవహారం కేంద్ర మంత్రి సదానంద గౌడకు జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చిపెట్టింది.