బోయినపల్లి కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్ తల్లిదండ్రుల అరెస్ట్ కు రంగం సిద్ధం.. 

బోయినపల్లి కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పోలీసులకు అతని ఆచూకీ కూడా తెలియని పరిష్టితి నెలకొంది. దీంతో ఈ కేసులో భార్గవ్‌రామ్ తండ్రి శ్రీరామ్ నాయుడు దంపతులను అరెస్ట్ చేసేందు‌కు రంగం సిద్ధమైంది. యూసఫ్‌గూడలోని ఎంజీఎం స్కూల్‌ దగ్గర ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించారు. బోయిన్ పల్లి కిడ్నాప్‌ కేసులో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ కిడ్నాప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీరామ్‌నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. తాము దుబాయ్‌ నుంచి శనివారమే వచ్చినట్లు అయన తెలిపారు. మరోపక్క ఈ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.