TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం జాతికి అంకితం.!

Published on: Tue Jul 14, 2026 11:06AM

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం  అయిన పోలవరం ప్రాజెక్టు  వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.  ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడమే   ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన సోమవారం(జులై 13)   పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్మాణ పనులను  ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయికి చేరుకుని స్పిల్‌వే, రేడియల్ గేట్లు, కాఫర్ డ్యామ్ పనుల పురోగతిని  పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నూతన కార్యాచరణ, గడువుపై విస్పష్ట ప్రకటన చేశారు. 

aస్పిల్‌వే నిర్మాణంతో పాటు రేడియల్ గేట్లు, ఎగువ,  దిగువ కాఫర్ డ్యామ్ పనులను పూర్తి చేశామని చెప్పారు. గోదావరి నదికి వచ్చే దాదాపు 50 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని   తట్టుకునే విధంగా   గేట్లను డిజైన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

అయితే..  ఐదేళ్ల  వైసీపీ హయాంలో..  పోలవరం ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాము 2019 నాటికి కష్టపడి 72 శాతం మేర పూర్తి చేసిన ప్రాజెక్టు పనులను.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్..  రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పక్కన పెట్టేసిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ  వద్దని వారించినప్పటికీ, మొండిగా టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును ఆలస్యం చేశారని మండిపడ్డారు.

రూ. 440 కోట్లతో నిర్మించిన అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ వరదలకు దెబ్బతిన్నప్పటికీ కనీసం పట్టించుకోలేదని, ఫలితంగా ఇప్పుడు నూతనంగా దానిని నిర్మించాల్సిన భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడిందన్నారు. భూసేకరణ,  నిర్వాసితుల పునరావాస ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..  పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ప్రాజెక్టు పరిధిలో ఇప్పటివరకు దాదాపు 94వేల152 ఎకరాల భూమిని సేకరించినట్లువివరించిన ఆయన  మిగిలిన భూసేకరణ పనులను ఈ ఏడాది అక్టోబర్ నాటికి  పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు.  పునరావాస కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే సుమారు 17 వేల 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, మిగిలిన నిర్వాసిత కుటుంబాల తరలింపు, పునరావాస కాలనీల నిర్మాణాన్ని కూడా మార్చి 2027 నాటికి   ముగిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల కోసం ఇప్పటివరకు 17 వేల 118 గృహాల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. 

Polavaram,  dedicated to nation,   March next year, cbn, Polivaram Project, Works