ఏపీకి కాస్త ఊరటనిచ్చిన కేంద్రం..

 

ఇప్పటివరకూ ఏపీకి షాకుల మీద షాకులు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు కాస్త ఊరట కలిగించే కబురునిచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు  కేంద్రం నిధులు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తొలి విడతగా రూ.1098 కోట్లు విడుదల చేసిన కేంద్రం... పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తొలి విడతగా రూ.1098 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. త్వరలోనే మరో రూ.302 కోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే నాబార్డు ద్వారా మరో రూ.1400 కోట్లను రుణంగా తీసుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతించింది. కాగా గత కొద్ది రోజులుగా పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా ప్రతిపక్షాలు, కేంద్రం అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.