పోలవరం ప్రాజెక్టుపై నాబార్డుతో ఒప్పందం..

 

ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టుపై సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సుజనా చౌదరితో పాటు జలవనరుల, ఆర్ధిక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై నాబార్డుతో ఒప్పందం కుదిరిందని... నాబార్డు రుణాన్ని కేంద్రమే చెల్లిస్తుందని.. నాబార్డు నేరుగా కేంద్రానికి నిధులు ఇస్తుందని అన్నారు.. అక్టోబర్ 15 నుండి నిధులు చెల్లించడానికి అంగీకారం తెలిపినట్టు చెప్పారు. మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు ఉన్నాయి.. ఇప్పుటి వరకూ ఖర్చు చేసిన నిధులను చెల్లించడానికి కేంద్రం సిద్దంగా ఉంది అని తెలిపారు.