Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సోనియాకు థ్యాంక్స్ చెప్పిన మోడీ
posted on: May 8, 2015 11:49AM

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలం నుండి బంగ్లాదేశ్ సరిహద్దు వివాదం సాగుతుంది. దీనిపై లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు అమలుకు కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ.. కాంగ్రెస్ పార్టీ అందించిన సహకారాన్ని మరిచిపోమని, బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపినందుకు సోనియాగాంధీకి ధన్యవాదాలని అన్నారు. ఈ బిల్లు అమలైతే ఏ దేశపు సరిహద్దులో ఉన్నామో కూడా తెలియకుండా ఉన్న కొన్ని వేల మందికి మేలు చేసినట్టువుతుందని మోడీ అన్నారు. ఈ బిల్లు ద్వారా మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న 51 బంగ్లాదేశీ కాలనీల్లో ఉన్న దాదాపు 15 వేల మంది ఇండియా భాగంలోకి వస్తారని, ఒకవేళ వారు రావడానికి ఇష్టం లేకపోతే అక్కడే ఉండే అవకాశం కల్పిస్తామని తెలిపారు.


.jpg)



