ఏకే 47 పేల్చి మోడీకి పాక్ చిన్నారి వార్నింగ్...

 

మొన్నటి వరకూ కాశ్మీర్ అల్లర్లతో భారత్-పాకిస్థాన్ ల మధ్య గొడవ ముదరగా.. ఇప్పుడు ఉరీ పై ఉగ్రవాదులు దాడి నేపథ్యంలో ఆ గొడవ కాస్త ముదిరి పాకానా పడింది. రెండు దేశాల మధ్య మాటల యుద్దాలు మొదలయ్యాయి. ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నారు. అయితే  ఇప్పుడు పాకిస్థాన్ ఓ అడుగు ముందుకేసినట్టు కనిపిస్తోంది. మామూలుగానే పాకిస్థాన్ చిన్నపిల్లల్లో కూడా భారత్ పై ద్వేషాన్ని పెంచుతుందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అది నిజమే అన్న భావన కలుగుతుంది ఓ వీడియో చూస్తుంటే. ఆవీడియోలో ఓ చిన్నారి ఏకే-47 గన్ పట్టుకొని ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తుంది. అలా చెప్పిస్తున్నది కూడా తన తండ్రే. పట్టుమని ఐదేళ్లు కూడా లేని తన కూతురి చేత ఏకే-47 గన్ పట్టించి.. తుపాకీ పేలుస్తూ మోడీకి వార్నింగ్ ఇప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దగ్గరుండి కూతురికి గన్ ఎలా పేల్చాలో నేర్పిస్తున్న అతడెవరో తెలియరాలేదుగానీ, ఈ వీడియోను చూసిన భారతీయులు మాత్రం మండి పడుతున్నారు. మరి దీనిపై పాక్- భారత్ ల మధ్య వైరం ఇంకెంత పెరుగుతుందో చూడాలి.