మోడీపై కేసు నమోదు..


ప్రధాని నరేంద్ర మోడీపైనే కేసు నమోదైంది. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ జెండాను ఒక గుడ్డముక్కలాగా ఉపయోగించుకున్నారని, దానిపై కూర్చున్నారని, చేతులు, ముఖం తూడ్చుకున్నారని బీహార్ కు చెందిన ప్రకాశ్ కుమార్ అనే న్యాయవాది ముజఫర్ పూర్ జిల్లాలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటికి జాతీయ జెండానే కాకుండా కోట్లమందిని భారతీయులను కూడా మోదీ అవమానించారని ఆరోపించారు. దీనిపై వచ్చే నెల(జూలై) 16న విచారణ జరగనుంది.