మోడీ పాలన ‘వంద’ర్‌ఫుల్... వెంకయ్య..

 

భారత ప్రధాని నరేంద్రమోడీ వంద రోజుల పాలన చాలా బాగుందని, వందరోజుల్లోనే మోడీ మార్కు పాలన చూశామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని వెంకయ్య చెప్పారు. యుపీఏ పాలనలో అన్నీ లోట్లేనని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా విమర్శించారు. దేశంలో ప్రజల సమస్యలను తీర్చడానికి మోడీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ఇతర దేశాలతో సంబంధ బాంధ్యవ్యాల మీద కూడా మోడీ దృష్టి కేంద్రీకరించారని వెంకయ్య నాయుడు అన్నారు.