ఫ్లోర్ లీడర్లతో 8న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
posted on Apr 4, 2020 8:53PM
ఉదయం 11 గంటలకు ప్రారంభం
కరోనా విజృంభణ నేపథ్యంలో మాట్లాడనున్న మోదీ
ప్రకటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పలు పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఆయన ఈ నెల 8న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నారు. 'పార్లమెంటులో 5 కన్నా ఎక్కువ సీట్లున్న పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతారు' అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ ప్రకటనలో తెలిపారు.కాగా, కరోనాపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనుండడం గమనార్హం.