డ్రమ్ వాయించిన మోడీ

 

ప్రస్తుతం జపాన్ పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్రమోడీ అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. రెండు రోజుల క్రితం జపాన్‌లోని ఓ పురాతన బడికి వెళ్ళి అక్కడి పిల్లలను ఆకట్టుకున్న మోడీ, సోమవారం నాడు ఫ్లూట్ వాయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన లయబద్ధంగా డ్రమ్స్ వాయించారు. మంగళవారం ఉదయం నరేంద్ర మోడీ టోక్యోలో టీసీఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ సంప్రదాయ టైకో డ్రమ్స్‌ వాయించాలంటూ టీసీఎస్ సీఈఓ చంద్రశేఖర్‌ మోడీని ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న మోడీ డ్రమ్ ఎలా వాయిస్తారో దీక్షగా గమనించి... అనంతరం డ్రమ్స్‌పై ఫాస్ట్‌బీట్ ఉత్సాహంగా వాయించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు.